Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉమ్రా యాత్రను రాజకీయం చేయొద్దు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్

విశాలాంధ్ర,కదిరి.(శ్రీసత్య సాయి జిల్లా) పవిత్ర ఉమ్రా యాత్రను రాజకీయం చేయొద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ హితవు పలికారు. సోమవారం కదిరి మున్సిపల్ పరిధిలోని 22 వార్డులో కౌన్సిలర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో దైవదర్శనానికి వెళ్లిన నా ఉమ్రా యాత్రను రాజకీయాలకు ముడి పెట్టి వార్తలు రాసిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
ఇఫ్తార్ విందుకు హాజరైన మైనారిటీల పక్షపాతి సీఎం జగనన్న గురించి మాట్లాడేవారు ఇఫ్తార్ కి, ఇఫ్తార్ విందుకి మధ్య తేడా తెలుసు కొని మాట్లాడాలని హితువు పలికారు.ఎవరెన్ని మాట్లాడిన ముస్లింలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి వైఎస్ఆర్సిపితోనే సాధ్యమన్నారు.వాలంటీర్ల వ్యవస్థను పనిచేయకుండా చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రతి అవ్వాతాత సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడంతోపాటు సీఎం జగనన్నను రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, రాష్ట్ర సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షులు జిలాన్ భాష, వైఎస్ఆర్సిపి నాయకులు పరికి సాధిక్ భాష, లీగల్ సెల్ జోనల్ ఇంచార్జ్ లింగాల లోకేశ్వర్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img