విశాలాంధ్ర -ధర్మవరం:: ప్రతి వ్యక్తి సేవ గుణమును అలవర్చుకోవాలని అప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పరమపిత శ్రీ వెంకటరమణ చార్య గురువు ట్రస్ట్ వ్యవస్థాపకురాలు యోగి ముక్తేశ్వరి మాతాజీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టూ టౌన్ సీఐ అశోక్ కుమార్ 35వ వార్డు కౌన్సిలర్ చింత మారుతి ప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పరమపిత శ్రీ వెంకటరమణాచార్య గురువు 12వ ఆరాధన మహోత్సవాల్లో సందర్భంగా నాలుగవ రోజు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణము వద్ద అన్నదాన కార్యక్రమాన్ని వారు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్నదానం చాలా విశిష్టమైన సేవ అని తెలిపారు. కేవలం అన్నదానం మాత్రమే మనిషికి ప్రతి జీవికి సంతృప్తి ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు తోపాటు వైస్ చైర్మన్ అశోక్ కుమార్, కార్యదర్శి రామాంజనేయ చారి, ఉపాధ్యక్షుడు మల్లికార్జున, కోశాధికారి నాగభూషణ పాల్గొన్నారు.