మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: కేంద్ర ఎన్నికల అధికారుల యొక్క ఎన్నికల విధి విధానాలు అందరూ విధిగా పాటించాలని మునిసిపల్ కమిషనర్ రామ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలలో ఇతర ముఖ్యమైన కూడలిలో గల వివిధ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలను, గోడలపై రాతలను తొలగించడం జరిగిందన్నారు. అదేవిధంగా పట్టణంలోని వివిధ కోడలిలో గల రాజకీయ పార్టీ కు సంబంధించిన విగ్రహాలకు పూర్తిగా వస్త్రముతో మూసివేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల విధి విధానాలను సంబంధిత అధికారులు సిబ్బందితో ఎప్పటికప్పుడు సమావేశాన్ని నిర్వహించి, ఎన్నికలు విజయవంతం అయ్యేలా తాము కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా ఎన్నికలకు సంబంధించిన వాటిలో ఏదైనా అనుమానాలు ఉంటే పరిష్కరించుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. అదేవిధంగా ప్రతి వార్డులోనూ వార్డు కౌన్సిలర్లు ఏ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు, అదేవిధంగా గోడ రాతలు ఉండరాదని కూడా తాము సూచించడం జరిగిందని తెలిపారు. కావున పట్టణ ప్రజలతో పాటు, కౌన్సిలర్లు వివిధ పార్టీ ప్రతినిధులు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తమ సహాయ సహకారాలు కూడా అందించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.