Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రతి ఒక్కరూ దేశ సేవను అలవర్చుకోవాలి.. ఆర్డీవో రమేష్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి ఒక్కరూ దేశ సేవను అలవర్చుకోవాలని ఆర్డిఓ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రమేష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆనాటి దేశ నాయకులు తమ ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించడం జరిగిందన్నారు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో- కతిజుణ్ కుప్రా, ఉప తాసిల్దార్లు అంపయ్య, లక్ష్మీదేవి, ఇన్చార్జ్ ఎంఆర్ఓ ఈశ్వరయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తాసిల్దార్ కార్యాలయంలో:: పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జ్ తహసిల్దార్ ఈశ్వరయ్య 75 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
ధర్మవరం కోర్టులో:: పట్టణంలోని కోర్టులో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జడ్జిలు, న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుకల యొక్క ప్రాధాన్యతను వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపుల్ జూనియర్ సివిల్ జడ్జి శివపార్వతి, అడిషనల్ జూనియర్ రమ్య సాయి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img