వ్యవసాయ అధికారి ముస్తఫా
విశాలాంధ్ర ధర్మవరం:: రైతులు సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించుకుంటే అధిక దిగుబడి లభిస్తుందని వ్యవసాయ అధికారి ముస్తఫా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల నుంచి మండల పరిధిలోని 16 రైతు భరోసా కేంద్రాలలో అవసరమైన రైతులకు 3,300 క్వింటాల వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాలలో కందులు కూడా లభ్యమవుతున్నాయని, ప్రత్యామ్నాయ పంటగా ఈ కందులను వేసుకోవచ్చు అని తెలిపారు. రసాయనిక ఎరువులను తగినంతగా మాత్రమే పంటకు వాడుకోవాలని తెలిపారు. గత సంవత్సరంలో మండలములో 12, 000 వేల ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగ పంటను వేయడం జరిగిందని, సకాలంలో వర్షాలు రాకపోవడం వలన రైతులకు పంట దిగుబడి ఆశించినంతగా రాలేకపోవడం నష్టాలు పాలు కావడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాలలో పంట విషయములో తగిన సలహాలు, సూచనలు కొరకు, అదేవిధంగా ఉద్యాన పంటలకు సహాయ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సంవత్సరం అనుకున్న విధంగా వర్షాలు పడ్డాయని, రైతులు పంట వేసేందుకు అన్ని పనులు ప్రారంభించుకొని అవకాశము ఉందని తెలిపారు.