విశాలాంధ్ర ధర్మవరం:: పాలీసెట్-24 కు ఉచిత శిక్షణ పాలీసెట్ ప్రవేశ పరీక్షలకు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతిరోజు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణా కాలములో స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ స్టడీ మెటీరియల్ను అనుభవజ్ఞులైన అధ్యాపకులచే శిక్షణ అండ్ మాకు టెస్టులు జరిపి అత్యుత్తమ ర్యాంకు సాధించే విధంగా తయారు చేయడం జరిగిందని తెలిపారు. కావున పదవ తరగతి పరీక్ష వ్రాసిన లేదా ఇదివరకే పదవ తరగతి పాసైన విద్యార్థులు అందరూ కూడా అర్హులేనని తెలిపారు. పాలీసెట్ పరీక్షలు ఏప్రిల్ 27వ తేదీన ఉంటుందని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.