Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే లకు మంత్రు పదవులు ఇవ్వండి…

ధర్మవరం పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల సంఘం వినతి

విశాలాంధ్ర ధర్మవరం:: ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్, కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాదులు అత్యధిక మెజార్టీతో గెలుపొంది గొప్ప విజయాన్ని సాధించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ధర్మవరం పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి, కార్యదర్శి హేమంత్ కుమార్, ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్, రంగ మాది నారాయణ, గౌరవ అధ్యక్షులు పోలా వెంకటరమణ, కలవల రాంకుమార్ లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సెమినారాయణ స్వామి దేవాలయంలో చేనేత వ్యాపారస్తుల అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ధర్మవరం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేక పోయిందని, వ్యాపారస్తులు చేనేత కార్మికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగిందని వారు తెలిపారు. 56 సంవత్సరాలు తర్వాత బీసీ అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ కు ఎమ్మెల్యే గా అవకాశం బిజెపి పార్టీ ఇవ్వడం, నియోజకవర్గ ప్రజలు, వ్యాపారస్తులు, చేనేతలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడం చరిత్రలో చారిష్టాత్మక సంఘటన అని తెలిపారు. సత్య కుమార్ యాదవ్కు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, వివిధ కేంద్రంలో గల మంత్రులతో ఎంతో సన్నిహిత సంబంధం ఉందని, ఈ సన్నిహిత సంబంధం తోనే తప్పకుండా ధర్మవరం అభివృద్ధికి నోచుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరి ఇరువురికి మంత్రు పదవులు ఇవ్వటములో ఒక ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని వారు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యురాలు జయశ్రీ, నీలూరి శ్రీనివాసులు, నామాల శంకర్, కలవల మురళీధర్, పామిశెట్టి శివశంకర్,గిర్రాజు శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img