శ్రీరామ భజన మందిర నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తేరు బజారులో గల వాసవి కళ్యాణ మండపం (కొత్త సత్రంలో) శ్రీరామ భజన మందిరం ఆధ్వర్యంలో ఘనంగా గోదా రంగనాయకుల కళ్యాణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు శ్రీనాథ్ శర్మ వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ, కళ్యాణోత్సవ వేడుకలను, సాంప్రదాయ పద్ధతిలో భక్తాదులు నడుమ నిర్వహించారు. తొలుత ఉత్సవ విగ్రహాలను కు ప్రత్యేక పూజలు వనర్చిన తర్వాత, వివిధ పూలలతో అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీరామ భజన మందిర నిర్వాహకులు దేవతా కృష్ణమూర్తి, కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు, జయంతి ప్రసాద్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఈ గోదా రంగనాయకుల కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా దాతలతో పాటు దేవత కుటుంబ సభ్యులచే నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం 700 మంది భక్తాదులకు సత్రంలోనే అన్నదాన కార్యక్రమాన్ని కూడా వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ భజన మందిరం సభ్యులు, అత్యధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.