విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గంలోని బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారి స్వగృహంలో నియోజకవర్గంలోని 17 మంది బాధితులకు వారి చేతులమీదుగా రూ..21.93 లక్షలు విలువ చేసే శక్తులను వారు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ధర్మవరం భర్తలపల్లి తాడిమర్రి ముదిగుబ్బ మండలాలలో అనారోగ్య దృష్ట్యా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు ప్రభుత్వం ఇటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం అని తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా తాను నియోజకవర్గంలో కులాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా నవరత్నాల సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఏ ప్రభుత్వము చేయని ప్రజా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరిటన నిర్వహించడం గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కి వారు కృతజ్ఞతలను తెలియజేశారు. తదుపరి బాధితులు కూడా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, మెప్మా అధికారి వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు