Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలి. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

విశాలాంధ్ర బ్యూరో- శ్రీ సత్యసాయి : ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని మేడాపురంలో నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ ల భవన నిర్మాణాలను, హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ ల భవన నిర్మాణాలను చేపడుతోందన్నారు. ఆయా భవనాల నిర్మాణంలో వేగం పెంచాలని, వచ్చే ఆగస్టు 15 వ తేదీనాటికి రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ ల భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ భవన నిర్మాణాన్ని కూడా త్వరితగతిన చేపట్టాలన్నారు. అధికారులు భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలన్నారు. నిత్యం ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని, లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని సూచించారు. ఇందులో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, ఈఈ మురళీమోహన్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img