ధర్మవరం జిర్.పి. సి ఐ నాగరాజు
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం రైల్వే జంక్షన్ లో వచ్చే ప్రతి రైలును ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధర్మవరం జిఆర్పి రైల్వే పోలీసులు, జి ఆర్ పి సి ఐ నాగరాజు ఆధ్వర్యంలో రైతుల భోగిలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈనెల 22న అయోధ్యలో రాముని ప్రతిష్ట ఉన్నందున పగటిబందీగా ఎటువంటి సంఘటనలు జరగకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా భోగి సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా కూడా రైల్వేటేషన్లోని పార్సల్ సర్వీస్ కార్యాలయం కూడా క్షుణ్ణంగా వారు పరిశీలించారు. రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికుల దగ్గర గల లగేజ్ను కూడా తప్పనిసరిగా తనిఖీలు చేస్తూ అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వారి ద్వారా వివరాలను కూడా సేకరించడం జరుగుతుంది. జి ఆర్ పి పోలీసులను ఈ కార్యక్రమాల పండుగ వేడుకలు, జనవరి నెల వరకు ఈ తనిఖీలు తప్పనిసరిగా నిరంతరం ఉంటాయని జిఆర్పి.సి ఐ. నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గోపి కుమార్ తో పాటు జిఆర్పి సిబ్బంది పాల్గొన్నారు.