మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: నా ప్రాణం ఉన్నంతవరకు, అధికారం ఉన్న, లేకున్నా, ధర్మవరం నియోజకవర్గ ప్రజల కోసమే అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారం పై నిరంతరం పోరాటం చేస్తానని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోనుగుంట్ల సూర్యనారాయణ వ్యక్తిగత కార్యాలయంలో నియోజకవర్గంలోని ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలతో వారు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం గోనుగుంట్ల సూర్యనారాయణ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరి ఆశీస్సులతో బరిలో నిలబడతానని, అధిష్టానానికి అన్ని వివరించా నాని వారు తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న వెన్నుపోటు రాజకీయాల గురించి, వారి కుమ్మక్కు రాజకీయాలు గురించి అధిష్టానం పునరాలోచిస్తుందని, ఆశిస్తున్న లేని పక్షంలో, ధర్మవరంలో ప్రజల కార్యకర్తల అభిష్టం మేరకు ఎన్నికల బరిలో ఉంటానని వారు స్పష్టం చేశారు. ప్రజలందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ఏ పార్టీలో ఉన్న ,ఆ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని వారు తెలిపారు. ధర్మవరంలో అభివృద్ధి నినాదంతో వెళ్ళానే కానీ, ఏనాడు వెన్నుపోటు, కుట్ర రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేదని వారు తెలిపారు. వైయస్ఆర్సీపీ అభ్యర్థిని ఓడిస్తానని వారు సవాల్ విసిరారు. తాను అభివృద్ధి చేసిన వాటిని ప్రజలు గుర్తుపెట్టుకున్నారని, ప్రజలంతా నా వెంటే ఉన్నారని వారు తెలియజేశారు. నాకు ప్రతిసారి పోటువేయాలని చూస్తున్న పడమటల పతనానికి నాంది వేయాలని సూరన్నగా నా మంచితనం వదిలేసి ముళ్ళును ముల్లుతోనే తీయాలని అందుకే రాప్తాడులో కూడా మనమేంటో చూపియ్యాలని వారు కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గము నుండి నాయకులు కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.