బ్రెయిన్ యోగ గురువు శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం;; బ్రెయిన్ యోగాతో విద్యార్థులకు ఎంతో ఉపయోగం కలదని యోగా గురువు శ్రీధర్ గురూజీ బ్రెయిన్ యోగ గురువు శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్యవైశ్య కొత్త సత్రములో గ్లోబల్ బ్రెయిన్ యోగ శిక్షణా తరగతులను రెండు రోజులపాటు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ ఈ బ్రెయిన్ యోగ వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, మెదడు చురుకుగా పనిచేస్తుందని, చదివిన ప్రతి విషయము కచ్చితంగా గుర్తుండేలా చేస్తుందని తెలిపారు. విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాయాలన్న, చక్కటి ఏకాగ్రత కూడా ఉంటుందని తెలిపారు. అపారమైన జ్ఞాపకశక్తి మొదలుపెట్టిన పనిని చక్కగా పూర్తి చేయడం అలవాటు ఉందని తెలిపారు. కళ్ళు మూసుకొని రాయడం, చదవడం అభ్యసన జరుగుతుందని తెలిపారు. ఉన్నదానితో తృప్తి చెందడం, ఓర్పు సహనముతో ఉండడం, చక్కటి శారీరక రక్షణ వ్యవస్థ, దేనినైనా ఎదుర్కొనగలిగే సామర్థ్యం ఉంటుందని తెలిపారు. చక్కటి క్రమశిక్షణతో పాటు పరీక్షలలో చక్కటి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని, అందరితో చక్కటి సంబంధ బాంధవ్యాలు కూడా ఉంటాయని, డబ్బు కానీ, వనరులు గాని సవ్యంగా ఉపయోగించుకునేలా అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ వీకే సుంకు హరిప్రసాద్, గొర్రె వెంకటేశు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.