విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) ఏపీ చేనేత కార్మిక సంఘం 2024 క్యాలెండర్ల ఆవిష్కరణ టూ టౌన్ సీఐ అశోక్ కుమార్ చేతులు మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం సిఐ మాట్లాడుతూ చేనేత కార్మికుల తరఫున ఏపీ చేనేత కార్మిక సంఘం కొన్ని దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూ రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. రైతుల యొక్క కష్టాల,నష్టాలను పోరాటాల ద్వారా వివిధ రూపాల నిరసన ,సమ్మెల ద్వారా ప్రభుత్వ దృష్టికి తెచ్చి, పరిష్కరించే దిశగా ఈ కార్మిక సంఘం కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం కార్యదర్శి వెంకటనారాయణ, వెంకటస్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, చేనేత నాయకులు శ్రీనివాసులు, ఆదినారాయణ, లక్ష్మీనారాయణ,వీర నారప్ప తదితరులు పాల్గొన్నారు.