విశాలాంధ్ర ధర్మవరం-మాజీ ముఖ్యమంత్రివర్యులు, టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ని ధర్మవరం ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజకీయ పరిస్థితులు గూర్చి వారు చర్చించడం జరిగింది. తదుపరి ధర్మవరం నియోజకవర్గంలోని సమస్యలను వారికి తెలపడం జరిగింది. ఏపీలో వైసిపి అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని కేంద్రంలో మోడీ నేతృత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సహకారంతో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కానున్నదని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈనెల 4వ తేదీన ధర్మవరం నియోజకవర్గంలో వెళుతున్నట్లు వారు తెలిపారు.