బాణసంచా కాల్చి సంబరాలు చేస్తున్న తెలుగుదేశం శ్రేణులు
విశాలాంధ్ర – ఎన్ పి కుంట: కదిరి శాసనసభా స్థానానికి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ భార్య కందికుంట యశోదా దేవికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నుండి గురువారం మధ్యాహ్నం ఉత్తర్వులు అందినట్లు కార్యాలయ వర్గాలు తెలియజేశాయి.. కందికుంట బార్య యశోదాదేవికి టికెట్ కేటాయించడంతో మండలంలో తెదేపా పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలు వెలిబుచ్చాయి. కదిరి నుండి ఎన్నికల బరిలో నిలిచిన కందికుంట యశోదా దేవి అభ్యర్థిత్వంతో వైసిపి వర్గాల్లో వణుకు మొదలైనట్లు టిడిపి శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. మండల తెదేపా ప్రధాన కార్యదర్శి నరసింహులు, మాజీ జెడ్పిటిసి అంజనప్ప నాయుడు, తెదేపా నాయకులు శ్రీరాములు నాయుడు , రెడ్డప్ప, రవీంద్ర, ఆదినారాయణ, ఎం రామిరెడ్డి, తెదేపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.