గోడపత్రికలు విడుదల చేసిన ఎస్సీ జన సంఘం నాయకులు
బత్తలపల్లి: మాదిగ మహా సమ్మేళనం జయప్రదం చేయాలని ఎస్సీ జన సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం బత్తలపల్లి లోని లక్ష్మీనరసింహస్వామి హమాలీ యూనియన్ కార్యాలయంలో జన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే కుల్లాయప్ప, కర్ణాటక రాష్ట్ర బాధ్యుడు మాల్యవంతం రాంప్రసాద్ వీరు స్థానిక నాయకులతో కలిసి గోడపత్రికలను విడుదల చేశారు. వారు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన అనంతపురం పట్టణంలోని సాయి నగర్ లో ఉన్న అంబేద్కర్ భవనంలో నిర్వహిస్తున్నామన్నారు. కావున మాదిగల అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. సాకే మణి, సాకే పెద్దన్న, నగేష్, యూత్ ప్రెసిడెంట్ ప్రదీప్, గొట్లూరు అశోక్ తదితరులు పాల్గొన్నారు.