విశాలాంధ్ర ధర్మవరం;;(శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు భాగాన రజకుల కులదైవం మడివా ల మాచి దేవుడు (ఈశ్వరుడు) జయంతి వేడుకలు అత్యంత వైభవంగా రజక సాధికార కమిటీ శ్రీ సత్యసాయి జిల్లా కన్వీనర్ మాలవంతం నారాయణస్వామి ఆధ్వర్యంలో జరుపుకున్నారు. అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ రజకుల కుల దైవం యొక్క మహిమలను గూర్చి వారు తెలిపారు. అనంతరం రజకులందరూ కూడా కులదైవాన్ని నిత్యం పూజించాలని తెలిపారు. మడివాల మాచి దేవుని ఆశీస్సులు లేనిదే ఏ కార్యము కూడా విజయవంతం కాదని తెలిపారు. అనంతరం వందలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్య హై స్కూల్ హెడ్మాస్టర్ నరేంద్ర, మస్తాన్ ,రామాంజనేయులు, సాకే అక్కులప్ప, సాకే వెంకటేష్, రాజు, తుంపర్తి వెంకటేష్, భాస్కర, ఆ క్కులప్ప, శ్రీనివాసులు, పులేటిపల్లి కృష్ణ, రామాంజనేయులు, రాజు, నాగ శేషు, ఎల్ఐసి ఆనంద్, ఊతప్ప, ఆర్వేటి నాగరాజ్ తదితర రజక సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.