Monday, May 6, 2024
Monday, May 6, 2024

బి ఎస్ మక్బూల్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

విశాలాంధ్ర,ఎన్ పి కుంట: కదిరి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఎస్ మక్బూల్ అహ్మద్ గురువారం కదిరి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ ను వేస్తున్న శుభ సందర్భంగా మండలంలోని ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు సర్పంచులు,ఎంపీటీసీలు తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల కన్వీనర్ కొత్త రంగారెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశాన్ని మండల కన్వీనర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు.ఎన్ పి కుంట నుండి భారీ ర్యాలీతో వాహనాల్లో తరలి వెళ్లడం జరుగుతుందన్నారు కావున ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ షామీర్ భాష, ఉప సర్పంచ్ సోమిరెడ్డి, వైసీపీ నాయకులు ఆదిరెడ్డి, రామచంద్ర రెడ్డి, అంజన్ రెడ్డి, అస్లాం, చెన్న కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img