Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు—ఎస్ టీ యు

విశాలాంధ్ర,ఎన్ పి కుంట: మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ పత్రికలో వచ్చిన వార్తను మేము పూర్తిగా ఖండిస్తున్నామని బుధవారం ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు హరి ప్రసాద్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి రామ మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ టీ యు సంఘం నాయకులు మాట్లాడుతూ మేము ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను విమర్శించలేదని తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యమ సంఘంగా ఉపాధ్యాయల సమస్యలను ప్రస్తావించమే తప్ప మేము ఎక్కడ ఏ పత్రికకు పేపర్ స్టేట్ మెంట్ ఇవ్వలేదని తెలిపారు. ఓ పత్రికలో మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పత్రిక స్టేట్మెంట్ ఇచ్చినట్లు వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని తెలిపారు. మా ప్రమేయం లేకుండా మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పత్రికా ప్రకటన ఇచ్చినట్లు వచ్చిన ఈ వార్తను పూర్తిగా ఖండిస్తున్నామని, ఈ అవాస్తవమైన వార్తను ఉపసంహరించుకోకపోతే సదరు పత్రికపై పరువు నష్టం దావా వేసేందుకు వెనుకాడమని ఎస్ టీ యు సంఘం నాయకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img