Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

తెదేపా కార్యకర్తలు తరలిరండి

విశాలాంధ్ర,ఎన్ పి కుంట: కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్ గురువారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల తెదేపా కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందికుంట వెంకటప్రసాద్ గెలిపించేందుకు తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ కార్యకర్తలు, టిడిపి శ్రేణులు కృషి చేయాలని వారు ఈ సందర్భంగా వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img