Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఇండియా కూటమి ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుంది..

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వత్థ నారాయణ.
విశాలాంధ్ర ధర్మవరం::: ఇండియా కూటమి ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుందని, ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఇండియా కూటమి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వర్త నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం రంగన అశ్వత్త నారాయణ ఆర్డిఓ కార్యాలయంలోని రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డికి ఎమ్మెల్యే పోటీ చేయబడే నామినేషన్ను అందజేశారు. అనంతరం మధు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి అయిన రంగన్న అశ్వ ర్థ నారాయణను అధిక మెజార్టీతో గెలిపించాలని వారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల సమస్యలు ఏమాత్రం అమలు పరచకపోవడంతో అభివృద్ధి జరగలేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, సిపిఎం నాయకులు జంగాలపల్లి పెద్దన్న, ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img