Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఎమ్మెల్యే కేతిరెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్

విశాలాంధ్ర ధర్మవరం:: స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై బిజెపి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ సోలార్ పేరుతో కోట్లు దండుకోవడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి కుయుక్తులు చేశారని, ఎన్నికల షెడ్యూల్ కు ముందు రోజే తెరచాటున జీవోను కూడా జారీ చేయడం జరిగిందని వారు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఎకరాల రైతులకు కాకుండా దోచేయడానికి అన్ని పొన్నాగాలు సిద్ధం చేశారని తెలిపారు. ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలని తెలిపారు. సోలార్ ముసుగులో భారీగా మోసానికి రైతులే గురి కావాల్సి వస్తుందని, ప్రజలు గుర్తించాలని తెలిపారు. 2000 మెగావాట్లు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఒక్కో మెగావాటికి మూడు ఎకరాలు అవసరం ఉండగా 6 ఎకరాలు సేకరించడంలో మతలబు ఏమిటని వారు ప్రశ్నించారు. అదేవిధంగా నామినేషన్ కార్యక్రమానికి వేలాదిమంది ప్రజలు హాజరై విజయవంతం చేసినందుకు పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలిపారు. మాపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వారి హెచ్చరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తప్పక నడుపుతానని చేనేత పరిశ్రాన్ని అత్యున్నత స్థాయిలో ఉండే విధంగా చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్యాంసుందర్ బెస్త శ్రీనివాసులు, టిడిపి నాయకులు కమతం కాటమయ్య పరిచే సుధాకర్, బిజెపి నాయకులు అంబటి సతీష్, సాకే ఓబులేసు, టిడిపి,జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img