Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర 3వ మహాసభల విజయవంతం చేయండి

శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్

విశాలాంధ్ర-కదిరి : ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు.శుక్రవారం కదిరి సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగే గిరిజన సమాఖ్య మహాసభలు ఈనెల 29 తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మాసాపేట మార్కెట్ యాడ్ వరకు ప్రదర్శన జరుగుతుందని తెలిపారు.అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బంగ్లా సర్కిల్ కాలేజ్ గ్రౌండ్ లో బహిరంగ సభ జరుగుతుందన్నారు.నేడు దేశంలో,రాష్ట్రంలో జరుగుతున్న గిరిజన, దళిత, బహుజన మైనార్టీ వర్గాలపైన రోజు రోజుకు దాడులు పెరిగి పోతున్నాయన్నారు.అధికారంలో ఉన్న
వైసీపీ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు గొంతు ఎత్తి మాట్లాడలేకపోతున్నాయన్నారు.
ఈ వర్గాలను కాపాడుకోవడానికి ప్రశ్నించే గొంతుకలుగా తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర మూడవ మహాసభలు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి పట్టణంలో మూడు రోజుల పాటు జరగబోతున్నాయని తెలిపారు.ఈ సభలకు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుండి ఆట పాటలతో గిరిజన కళా నృత్యాలు చేసే కళాకారులు హాజరుకానున్నారని,ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్య నారాయణ మూర్తి,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య అరుణోదయం విప్లవ గాయని విమలక్క పాల్గొననున్నారన్నారు.సత్యసాయి జిల్లా వ్యాప్తంగా గిరిజనులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ మహాసభలను విజయవంతం చేయాలని వేమయ్య యాదవ్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img