విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములో నవరత్నాల పేదలందరికీ ఇల్లు అనే ప్రభుత్వ పథకంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగిందని ఆ పట్టాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు వేగవంతంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 7 గంటలకే సచివాలయంలోని ప్లానింగ్ కార్యదర్శులు, అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ కార్యదర్శిలతో అత్యవసర సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయ సమావేశ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మొత్తము పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు అర్హత గలవారేత గల వారందరికీ 13,421 ఇళ్ల పట్టాను ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ఇందులో మొదటి ఫేసులో 8,475 మంది లో 4,871 మంది ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్ పూర్తి కావడం జరిగిందని, మిగిలిన లబ్ధిదారుల పట్టాల యొక్క రిజిస్ట్రేషన్ ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని వారు సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు ఇవ్వరాదని, రిజిస్ట్రేషన్ చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. తక్కువ పురోగతి ఉన్నవారు అదనంగా కృషి చేస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, సచివాలయ ప్లానింగ్, అడ్మిన్, రెవెన్యూ కార్యదర్శిలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.