విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) ప్రతి సంవత్సరము పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం యొక్క బ్రహ్మోత్సవాలు ప్రత్యేక వాహనముల ద్వారా పురవీధులలో ఊరేగింపు కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో జరుగుతుంది. ఈ సందర్భంగా దాతలు నూతన వాహనములను, చంద్రప్రభ వాహనము, అభిషేక పీఠమును ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం ఆలయ ఈవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వారికి ఆ నూతన వాహనాలను అందజేశారు. చంద్రప్రభ వాహనమునకు దాతలు పంచాంగం సరసా దత్త మూర్తి, సౌందర్యలహరి కుమారుడు బ్రహ్మశ్రీ కాశీ విశ్వనాథ శర్మ కాగా, అభిషేక పీఠమును చేయించిన దాతలు వంకదారి గౌరమ్మ, వంకదారి సత్యనారాయణ శెట్టి జ్ఞాపకార్థం, వంకదారి నాగమణి ,వంకదారి కేశవ రామానుజ ప్రసాద్, వంకదారి నిఖిల, వంకదారి లక్ష్మి చెన్నకేశవ, వంకదారి జయశ్రీ, వంకదారి గోద వ్యవహరించారు. అనంతరం అర్చకులు కోనేరాచార్యులు, భాను ప్రకాష్, మకరందబాబులు దాతల పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించి, భగవంతుని ఆశీస్సులను అందజేశారు. తదుపరి ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం,ఆలయ ఈవో వెంకటేశులు దాతలను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ రామశాస్త్రి, ఆలయ సిబ్బంది మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.