విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని గోట్లూరూ గ్రామంలో పట్టణంలోని కే. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వారి ఆధ్వర్యంలో గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రత్యేక శిబిరమును నిర్వహించడం జరిగిందని పట్టణములోని ప్రభుత్వ కే. హెచ్. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయతీ సర్పంచ్ పిట్ట నరసమ్మ హాజరైనారు. అనంతరం ప్రిన్సిపాల్ తో పాటు సీనియర్ అధ్యాపకులు సెమీవుల్లా మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సమాజ సేవ, సేవా దృక్పథం అలవర్చుకుంటూ, పరిసరాల పరిశుభ్రత, ఇతరులకు చేసే సేవ ఎనలేనిదని తెలిపారు అదేవిధంగా మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని పర్యావరణాన్ని కాపాడుతూ జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఈ దత్తత కార్యక్రమం ఈనెల 25 నుంచి 31 వ తేదీ వరకు గ్రామములో నిర్వహిస్తామని తెలిపారు. తదుపరి ఓటర్ల దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తుకారాం ,అశోక్ కుమార్, సురేంద్ర, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గోపాల్ నాయక్, అధ్యాపకులు భువనేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.