విశాలాంధ్ర ధర్మవరం:: ఈనెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నియోజకవర్గ ప్రజలు వీక్షించేందుకై ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాట్లను రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల విజయ్ కుమార్, మహేష్ చౌదరి, ఎల్. నరేంద్ర చౌదరి, పరిసే సుధాకర్, కొత్తపేట ఆది, సంధ రాఘవ, పురుషోత్తం గౌడ్, గుడిపాటి చంద్ర, మాధవరెడ్డి, విజయ్ చౌదరి, అమర, సుధాకర్లు గ్రౌండ్ కి వెళ్లి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను త్వరితగతంగా నిర్వహించి ప్రజలకు వీక్షించేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి జరగకపోవడం, అప్పుల పాలు కావడం వలన, ఎంతోమంది ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తప్పక నడిపిస్తాడని, ఆయనకున్న అనుభవం ఎనలేనిదని, తప్పక అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం జరిగి తీరుతుందని వారు స్పష్టం చేశారు. గ్రౌండ్లో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాట్ల పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.