.విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో పట్టణంలోని 36 వార్డులలో ఎన్డీఏ కూటమి బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ కు అత్యధిక మెజారిటీ లభించింది. కానీ కేవలం నాలుగు వార్డులలో మాత్రమే మాజీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మెజారిటీ కైవసం చేసుకున్నారు. నియోజకవర్గంలో మొత్తము ఓటర్లు 2,45,758 ఓట్లు ఉండగా ఇందులో 2,18,282 మంది మాత్రమే తమ ఓట్లను సద్వినియోగం చేసుకున్నారు. తదుపరి పట్టణంలో ఎన్డీఏ కూటమికి 52,487 ఓట్లు రాగా వైసీపీకి కేవలం 35,978 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 2127 ఓట్లు రావడం జరిగిందన్నారు. మొత్తం మీద ఎన్డీఏ కూటమికి 16,509 ఓట్ల మెజారిటీ రావడం జరిగింది. ఈ ఓట్ల ఫలితాలు మెజార్టీ పట్ల పట్టణ ప్రజలతో పాటు తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ చరిత్రలో లోనే రాష్ట్రవ్యాప్తంగా ఇంత మెజార్టీ రావడం కీలక మరుపు రావడం జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.