క్యాంపు చైర్మన్, డివి. వెంకటేశులు (చిట్టి)
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే మా లక్ష్యము అని శ్రీ శాంత కళా చౌడేశ్వరి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బివి రమణ, క్యాంపు చైర్మన్ డివి. వెంకటేశులు(చిట్టి), కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ప్రాంగణమునందు ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో 98వ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శిబిరమునకు వచ్చిన రోగులకు బిపి, షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అనంతరం బివి. రమణ, చిట్టి మాట్లాడుతూ నిష్ణాతులైన డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సాయి స్వరూప్, డాక్టర్ డివి. జైదీపు నేత, డాక్టర్ వినయ్ కుమార్ లచే రోగులకు ఉచిత వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి కూడా తెలపడం జరిగిందన్నారు. అదేవిధంగా దాతల సహాయ సహకారములు తోనే ఇటువంటి వైద్య చికిత్స శిబిరములను నిర్వహిస్తున్నట్లు కూడా తెలిపారు. నాడు ఈ 98వ శిబిరమునకు దాతలుగా కీర్తిశేషులు మామిళ్ళ రంగప్ప జ్ఞాపకార్థం వీరి ధర్మపత్ని మామిళ్ళ నారాయణమ్మ, వారి కుమారులు మామిళ్ళ తులసి ప్రసాద్ అండ్ సన్స్ మాధవి లు వ్యవహరించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ శిబిరంలో మొత్తం 240 మంది రోగులకు వైద్యులచే వైద్య చికిత్సలను అందించడం జరిగిందని, ఒక నెలకు సరిపడు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రతినెలా 150 మందికి ఒక్కొక్కరికి 200 రూపాయలు చొప్పున పెన్షన్ కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార దర్శి బండి నాగరాజు తో పాటు మామిళ్ల అశ్వత్త నారాయణ, పెద్దకోట్ల విజయ్, పెద్దకోట్ల భాస్కర్, కాచర్ల నారాయణస్వామి, ఆదినారాయణ, పవన్, సాయి, బంధనాథం చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు.