విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయము అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు గూడూరు మోహన్దాస్, కార్యదర్శి గూడూరు రాజగోపాల్, కోశాధికారి వేణుగోపాలాచార్యులు తెలిపారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి శాస్త్ర చికిశా శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఈ లయన్స్ కంటి ఆసుపత్రిలో నిర్వహించబడే ఉచిత కంటి చికిత్స శిబిరాలు లయన్స్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు పిట్టా వెంకటస్వామి, ఆసుపత్రి ప్రమోటర్ గూడూరు నాగయ్య ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇటువంటి శిబిరాలను పేద ప్రజలు శిబిరములో పాల్గొని నీ అంతత్వాన్ని పోగొట్టుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ శిబిరంలో 70 మంది కంటి రోగులు రాగా 36 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. వీరందరికీ ఉచితంగా కంటి ఆపరేషన్లతో పాటు ఉచితంగా కంటి అద్దాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. బిపి, షుగర్ ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకొని శిబిరానికి రావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ఆపరేషన్లో ధర్మవరంలోని ఎర్రగుంటలో గల లయన్స్ కంటి ఆసుపత్రి యందు నిష్ణాతులైన కంటి వైద్య నిపుణులు ఎన్ కిరణ్ కుమార్ చే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. దగ్గర చూపు, దూరం చూపు ఇబ్బంది పడేవారు కి కంప్యూటర్ ద్వారా ఎర్రగుంట లోని లయన్స్ కంటి ఆసుపత్రిలో ఖచ్చితమైన కంటి అద్దములు కూడా పొందవచ్చునని తెలిపారు. అంతేకాకుండా ఆపరేషన్ అయినా కూడా చూపు తగ్గిన వారికి అతి తక్కువ ఖర్చుతో లేజర్ చికిత్స కూడా కలగని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు దాత పళ్లెం వేణుగోపాల్ తో పాటు గోశే రాధాకృష్ణ, సాగా రాధాకృష్ణ, వట్టి శివప్రసాద్, కొత్తపాలెం వెంకటేష్ కుమార్, పుట్లూరు నరసింహులు, నాగేంద్ర, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.