విశాలాంధ్ర ధర్మవరం;; ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యము అని అగ్నిమాపక అధికారి రాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ నుండి అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం కావడం జరిగిందని, 1944లో జరిగిన సంఘటన గుర్తుగా ప్రతి సంవత్సరం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి రోజున అగ్నిమాపక సిబ్బందిని సమావేశపరిచి అగ్ని ప్రమాదాలలో మరణించిన వారికి గుర్తుగా రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీఎస్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంప్రసాద్ పాల్గొని కరపత్రాలను బ్రోచర్లను విడుదల చేయడం జరిగింది అని తెలిపారు. ఈ వారోత్సవాలు.. వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.