చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్. కే. మహేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం:: చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధను కనపరచాలని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్. కే. మహేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయి నగర్ లో గల స్పందన ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం ను, స్పందన ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్.బషీర్, డాక్టర్. సోనియాలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ మహేంద్ర మాట్లాడుతూ పిల్లల్లో జ్వరము విష జ్వరాలు, ద గ్గు,ఊపిరితిత్తుల సమస్యలు ,కడుపునొప్పి, మలేరియా, టైఫాయిడ్, న్యు మోనియా, పచ్చకామర్లు బేదులు మెదడు వ్యాపు వ్యాధి మొదలగు జబ్బుల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి ఉండాలని తెలిపారు. వీటన్నిటికీ ప్రభుత్వ పథకాల ద్వారా ఉచితంగా అడ్మిషన్ చేసుకొని వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం పట్ల పిల్లలకు వైద్యుల సలహాలు మేరకు ఆహారంతో పాటు తగిన భద్రత కూడా ఉండాలని తెలిపారు. పిల్లలకు అత్యవసరమైనప్పుడు ఐసీయూ, ఫోటో తెరపి, హైప్లో ఆక్సిజన్ మిషన్స్, వెంటిలేటర్లు అవసరమైనప్పుడు తప్పక ఉపయోగించుకోవాలని తెలిపా రు. పిల్లల ఆరోగ్య భద్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అనంతరం డాక్టర్ బషీర్ మాట్లాడుతూ పేద ప్రజల కొరకు స్పందన ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ శిబిరంలో 63 మంది చిన్న పిల్లలు ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవడం వారి ఆరోగ్యానికి శ్రీకారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజర్ బాబా, దిల్దార్, నర్సులు పాల్గొన్నారు