మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని పురపాలక సంఘ కార్యాలయానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను ,ఖాళీ పన్నులను ఈనెల 31వ తేదీ లోగా వడ్డీ లేకుండా చెల్లించి, పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పురపాలక సంఘ కార్యాలయానికి చెల్లించాల్సిన పనులను ఆన్లైన్ ద్వారా గాని, మున్సిపల్ ఆఫీసులో గానీ, ఎస్బిఐ కాలనీ సచివాలయం (నియర్ ఎంపీడీవో ఆఫీస్), పిఆర్టి వీధిలోని సచివాలయం, గీతా నగర్ లోని సచివాలయం, పార్థసారథి-2 లోని సచివాలయం (ఎర్రగుంట దేవి నర్సింగ్ హోమ్ ఎదురుగా) గల కేంద్రాలలో పన్నులు చెల్లించాలని వారు తెలిపారు. పురపాలక సంఘమునకు రావలసిన పనులతోనే పట్టణ అభివృద్ధి ఆధారపడి ఉందని, కావున ఇటువంటి వడ్డీ లేకుండా అసలు మాత్రమే కట్టే అవకాశాన్ని పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.