విశాలాంధ్ర ధర్మవరం:: ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేస్తున్న అవినీతిని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, ఇటువంటి అవినీతిని తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా అడ్డుకుంటుందని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలే తాసిల్దార్ తోపాటు వీఆర్ఏ వీఆర్వోలు సస్పెండ్ కావడం జరిగిందని, దీని వెనకాల ఎమ్మెల్యే తో పాటు అనుచరులు ఉండి అవినీతిని ప్రోత్సహించింది నిజం కాదా అని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరులు నియోజకవర్గంలో ఎన్నో అవినీతి అక్రమాలు చేస్తున్నారని, వాటిని తప్పకుండా ప్రతిసారి టిడిపి అడ్డుకుంటుందని తెలిపారు. బెదిరింపులకు తాము భయపడేది లేదని తెలిపారు. అన్యాయాలు చేస్తే ప్రశ్నిస్తే పోలీసులు కేసు పెట్టడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇప్పటికే వేలకోట్లలో పలు విషయాలలో ఎమ్మెల్యే కేతిరెడ్డి అవినీతికి పాల్పడినట్టు సాక్షాధారాలతో రుజువైందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని సవాలు ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, తాడిమర్రి మండల జనసేన అధ్యక్షులు చంద్ర పాల్గొన్నారు.