విశాలాంధ్ర ధర్మవరం:: వ్యక్తిత్వ వికాస శిక్షణ విద్యార్థులకు ఎంతో అవసరమని,, ఈ శిక్షణతో భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కరెస్పాండెంట్సె శెట్టిపి నిర్మలాదేవి తెలిపారు. హైదరాబాద్ నగరముకు చెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షకులు క్రియేటర్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇవ్వడం జరిగింది. తదుపరి క్రియేటర్ శిక్షణలో భాగంగా మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో రాణించాలంటే ఇప్పటినుండి ప్రణాళికాబద్ధంగా, ఇష్టపడి, కష్టపడి, చదవాలని సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.. పట్టుదలతో ఒక లక్ష్యంతో చదువు విషయంలో ముందుకు వెళుతూ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు,మంచి గుర్తింపు తెచ్చేలా కృషి చేసిన నాడే, చదువుకు సార్థకం లభిస్తుందని తెలిపారు. నిరంతర చదువు విషయంలో ఎప్పటికప్పుడు చదువును అభ్యసిస్తూ ఉంటూ నిర్లక్ష్యము ఉండరాదని తెలిపారు. నిర్లక్ష్యంగా ఉంటే చదువు మరింత భారం అవుతుందని తెలిపారు.. న్యూనత భావానికి లోను కాకుండా ఉండాలని, పెద్దలను, తల్లిదండ్రులను,, గురువులను గౌరవించి, పూజించే అనేక అంశాలు వారు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సూర్యప్రకాశ్ రెడ్డి, ఎస్ .పద్మ, ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్. ఆదిశేషు పాఠశాల ఉపాధ్యాయ, బోధనేతర బృందం, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.