విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని ఓబుల నాయుని పల్లిలో ఈనెల 14వ తేదీ ఏజెంటుగా కూర్చున్నారని టిడిపి వర్గీయులపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఎన్నికల పోలింగ్ బూత్ లో టిడిపి వర్గీయులు భోగా లింగమయ్య కుమారుడు సింహాద్రి సత్య కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున పోలింగ్ ఏజెంట్గా కూర్చున్న రు. ఈ విషయంలో జీర్ణించుకోలేని వైసీపీ వర్గీయులు వారిపై తీవ్రంగా దాడి చేయడంతో మంగళవారం స్థానిక ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం జరిగింది. తదుపరి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్ పరామర్శించడం జరిగింది. తదుపరి ముందస్తు చర్యలుగా డి.ఎస్.పి శ్రీనివాసులు రూరల్ ఎస్సై నరేంద్రలు బుధవారం ఓబులాయన పల్లి కు వెళ్లి ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసులు మాట్లాడుతూ దాడులు, ప్రతి దాడుల వలన ఎవరికి న్యాయం జరగదని, తప్పు చేసినవారికి శిక్ష తప్పదని తెలిపారు. కావున ప్రజలందరూ చట్టపరంగా జీవించాలే తప్ప, కక్ష సాధింపు చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. ఓబులాయినిపల్లెలో మున్ముందు ఎటువంటి సంఘటనలు జరగకుండా డి.ఎస్.పి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఉండాలని తెలిపారు. దాడి చేసిన వారిని తప్పనిసరిగా చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని వారికి భరోసా ఇచ్చారు.