యోగా గురువు గొర్ల నారాయణరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: యోగా సాధన వల్ల చక్కటి ఆరోగ్యం చేకూరుతుందని యోగా గురువు గొర్ల నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆది గురు ఉచిత యోగా కేంద్రం మార్కెట్ యార్డ్ వద్ద రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సూర్య జయంతి సందర్భంగా 108 నమస్కారాలను గొర్ల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 65 మంది యోగా సాధకులు ఒకే సమయంలో 108 సూర్య నమస్కారాలను చేయడం జరిగింది. తదుపరి గొర్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ యోగా సాధన అనేది వయస్సుతో నిమిత్తం లేదని, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యమ్ యోగా వలన లభిస్తుందని తెలిపారు. తాను ఉచితంగా యోగాను నేర్పిస్తున్నానని ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.