విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆలయ కమిటీ, అర్చకులు, భక్తాదులు నడుమ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు సునీల్ కుమారాచార్యులు సుదర్శన ఆచార్యులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ విశేష పూజలను నిర్వహించి, స్వామివారిని విశేష అలంకరణ గావించారు. స్వామివారి విశేష పూల అలంకరణ భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. తొలితా స్వామివారికి పంచామృతాభిషేకము నిర్వహించారు. తదుపరి స్వామివారిని ప్రత్యేక వాహనంలో ఆశీనులు చేసి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. అనంతరం అర్చకులు రథసప్తమి యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బిళ్లే నాగప్ప, మేటికల కుల్లాయప్ప, రంగా శ్రీనివాసులు, రామాంజి ,దత్త వాలంటీర్స్, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.