ప్రత్యేక విద్యుత్ అవగాహన సదస్సు చైర్పర్సన్, రిటైర్డ్ జడ్జ్ వి శ్రీనివాస్ ఆంజనేయ మూర్తి.
విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యము అని ప్రత్యేక విద్యుత్ అవగాహన సదస్సు చైర్పర్సన్, రిటైర్డ్ జిల్లా జడ్జి వి శ్రీనివాస్ ఆంజనేయ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద గల సబ్ స్టేషన్ లో పట్టణ రూరల్ పరిధిలోని వినియోగదారులకు ప్రత్యేక విద్యుత్ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు దాదాపు 60 మంది దాకా వినియోగదారుడు హాజరై చిన్న, పెద్ద సమస్యలను వారు విన్నవించుకున్నారు. తదుపరి శ్రీనివాస్ ఆంజనేయ మూర్తి మాట్లాడుతూ విద్యుత్ వినియోగంపై వినియోగదారులకు ఉన్న సమస్యలను తీర్చేందుకే ఈ పరిష్కార వేదికను ఏర్పాటు చేశామని, రైతులు, ప్రజలుకు గల సమస్యలను విన్నవించుకోవడం జరిగిందని తెలిపారు. ట్రాన్స్ఫారములు కోరుటకుర్చీ, ఇళ్ల పైన విద్యుత్ వైర్లు గూర్చి, విద్యుత్ లైన్ మార్పులు గూర్చి తోపాటు ఎన్నో సమస్యలు రావడం జరిగిందని తెలిపా రు. మొత్తంలో ఈ పరిష్కార వేదికలో ఐదు సమస్యలు రావడం జరిగిందని, వాటిని ప్రకటించిన గడువు తేదీలోగా కచ్చితంగా చేయాలని తెలుపుతూ సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. కానీ ఈ ప్రత్యేక పరిష్కార వేదికపై ఇంకనూ ప్రజలకు పూర్తి దశలో అవగాహన కల్పించాల్సిన అవసరం అధికారుల మీద ఉందని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో లైన్ మార్పుల్లో ఒకటి, మూడు ట్రాన్స్ఫార్ములు, ఇళ్లపై పెద్ద లైను మార్పు లాంటి సమస్యలు రావడం జరిగిందని తెలిపా రు. ఏది ఏమైనా వినియోగదారులకు సమస్యలు లేకుండా ఉండేందుకు మరింత కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏఓ- బాలాజీ వెంకటేష్, ఏడిఈ- నాగేంద్ర, ఏఏఓ రామకృష్ణ, విద్యుత్ ఏఈలు ధర్మవరం- డి-1 నాగభూషణ, ఢీ 2 కొండారెడ్డి, రూరల్ ఏఈ జానకి రామయ్య, కార్యాలయ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.