విశాలాంధ్ర ధర్మవరం: కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ గా రాధాకృష్ణమూర్తి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఆయన చేసిన సేవలు అనన్యమైనవని, ఖాతాదారుల వద్ద మంచి గుర్తింపు కూడా పొందడం జరిగిందని ఇబ్బంది కరూర్ వైశ్యా బ్యాంక్ సిబ్బంది తెలిపారు. శనివారం కరూర్ వైశ్య బ్యాంక్ మేనేజర్ రాధాకృష్ణమూర్తి బదిలీలలో భాగంగా భీమవరం ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇందులో భాగంగా కరూర్ వైశ్యా బ్యాంక్ సిబ్బంది బదిలీపై వెళ్తున్న మేనేజర్ రాధాకృష్ణమూర్తిని ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బ్యాంక్ మేనేజర్ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ బ్యాంకు సిబ్బంది, ధర్మవరం పట్టణ ప్రజల సహాయ సహకారాలతో కరూర్ వైశ్యా బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఖాతాదారులు, బ్యాంక్ సిబ్బంది తనకు అందించిన సహాయ సహకారాలు మరిచిపోలేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది శివ, కృష్ణ,రాఘవ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.