విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల(వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) యందు ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వహిస్తున్నట్లు యువ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర,కార్యదర్శి ఆర్. జయరాం, కోశాధికారి బండి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ లో శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరము యువర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో, శ్రీ సత్య సాయి జిల్లా అంధత్వ నివారణ సంస్థ, నేత్రాలయ ఐ క్లినిక్ వారి సహకారంతో, పుష్పగిరి కంటి ఆసుపత్రి- కడప వారిచే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో కంటి శుక్లములు గల వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ/ ఈహెచ్ఎస్ నిబంధనల ప్రకారం ఆపరేషన్లు నిర్వహించబడునని తెలిపారు. శిబిరమునకు వచ్చువారు మీ ఆరోగ్యశ్రీ , ఈ హెచ్ ఎస్ కార్డు , బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్ వెంట తీసుకొని రావాలని తెలిపారు. శిబిరంలో కంటి వైద్య చికిత్సలు చేసుకున్న తర్వాత కంటి ఆపరేషన్కు ఎంపికైన వారిని ఇదే రోజు హాస్పిటల్ కు ఆపరేషన్ కొరకు తీసుకొని వెళదామని తెలిపారు. రెండు జతల బట్టలు, ఒక బెడ్ షీట్ తీసుకొని రావాలని తెలిపారు. కంటి శుక్లములకు ఆధునిక ఆపరేషన్ మెల్లకన్ను, రెటీనా, కార్నియా, గ్లూకోమా (నీటి కాసులు) కొయ్య ఖండా( టే రీజియం) చిన్నపిల్లల ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు చింత ఈశ్వరయ్య, భార్య కీర్తిశేషులు చింత వెంకట లక్ష్మమ్మ జ్ఞాపకార్థం కుమారుడు చింత శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా పట్టణ గ్రామీణ, ప్రాంతాలలోని ప్రజలు నేత్రదానం చేసి రెండు జీవితాలలో వెలుగు నింపాలని తెలిపారు. ఈ శిబిరంలో క్యాంపు చైర్మన్గా శ్రీకాంత్ రెడ్డి, ఆప్తాల మీకు అసిస్టెంట్ గా నాగరాజా ఆచారి వ్యవహరిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9886643560కు సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ గ్రామీణ, ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటి వెలుగును తెచ్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుకుమార్, డోనర్ చింతా శ్రీనివాసులు, చాంద్ బాషా, ఖలీల్, మోహన్, గొర్రె రమేష్ బాబు, డాక్టర్. బి వి. సుబ్బారావు తదితర సభ్యులు పాల్గొన్నారు.