విశాలాంధ్ర- ధర్మవరం:: ఎన్నికల నియమావళి అభలోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగస్థలాలలో రాజకీయ ప్రకటనలు, పోస్టర్లు ,హోటింగులు, కటౌట్లు వెంటనే తొలగించాలని ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ శనివారం సాయంత్రం నుండి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అమలులోకి రావడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే డివిజన్ పరిధిలోని అన్ని మండలాల తాసిల్దారులకు ఎన్నికల నియమ నిబంధనల యొక్క సూచనలు తెలపడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రజల నుండి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు అందితే వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు. సి విజిల్ యాప్ ను మరింత బలోపేతం చేయాలన్నారు. యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఇచ్చిన గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వాలంటీర్లు రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో పాల్గొంటే సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు.