టిడిపి నాయకులు
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని శివానగర్ కాలనీలో దాహార్తిని తీర్చాలని టిడిపి నాయకులు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్, పని కుమార్, నాగూర్ హుస్సేన్ మాట్లాడుతూ శివానగర్ కాలనీవాసులు నీటి కోసం ప్రైవేటు వ్యక్తులు డబ్బులు వసూలు చేయడం దారుణం అన్నారు. తక్షణమే పట్టణంలోని త్రాగునీటి ఎద్దడి గల ప్రాంతాల్లో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి, పైపులైన్లను వేయాలని డిమాండ్ చేశారు. వేసవి రాకముందే పట్టణములో త్రాగునీటి ఎద్దడి మొదలైందని తక్షణమే ఇంజనీరింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇందిరమ్మ కాలనీ ఎల్త్రీలలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు సొంతంగా మేమే పైపులైను వేసి నీటిని సరఫరా చేస్తున్నామని ఒక్కొక్క కొళాయి కనెక్షన్ కు 5000 రూపాయలు ఇవ్వాలని లేనిచో కొళాయి కనెక్షన్లు కట్ చేస్తామని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నట్లు కమిషనర్ దృష్టికి తీసుకొని వచ్చారు. డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, మారుతి స్వామి, సురేష్, అంబటి సనత్ తదితరులు పాల్గొన్నారు.