విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో శిక్ష సప్తహ రోజువారి కార్యక్రమాన్ని ఎంఈఓలు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి రోజు స్థానిక వనరులతో బోధనా సామాగ్రి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులు తయారుచేసిన బోధనా సామాగ్రిలను పరిశీలించి పాఠశాలలో స్థానిక వనరులతో ఆకర్షణీయమైనటువంటి ప్రాజెక్టులను తయారు చేసినందుకు హెచ్ఎం ఉమాపతి కు పుష్పగుచ్చాలు అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిక్ష సప్త హో కార్యక్రమాలలో ఈనెల 22 స్థానిక వనరులతో బోధనా సామాగ్రి ప్రదర్శన, 23న పునాది అభ్యాసన, సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం,, 24న క్రీడా పోటీలు నిర్వహణ, 25న సాంస్కృతిక కార్యక్రమాలు, 26న సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం వేడుకలు ఉంటాయి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.