ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నామాల నాగార్జున
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రైవేట్ ఉపాధ్యాయులపై ఒత్తిడి ఆపాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నామాల నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు తహసిల్దార్ యుగేశ్వరి దేవికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 9 నుండి 18 దాకా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిందని అయితే ప్రభుత్వ నిబంధనలను తప్పుతారు పట్టిస్తూ పట్టణములో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు స్వేచ్ఛగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని వారు మండిపడ్డారు. మరోవైపు ప్రైవేట్ ఉపాధ్యాయుల పట్ల చిన్నచూపు చూస్తూ ర్యాంకులే తమ ధ్యేయంగా భావిస్తూ ఉపాధ్యాయులపై ఒత్తిడికి గురి చేయడం చాలా దారుణమని తెలిపారు. అలాంటి పాఠశాల యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బాబ్జాన్, దామోదర్, అమర్ తదితరులు పాల్గొన్నారు.