విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మోడల్ కళాశాలలో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలలో విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరంలో 53.2 శాతము ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 55.7 శాతము ఉత్తీర్ణత రావడం జరిగిందన్నారు. ప్రగతికరపరిచిన విద్యార్థులలో ఎంపీసీ లో టి. నాగజ్యోతి 886/1000 మార్కులు, బైపీసీలో ఎస్. వందన 831/1000, సీఈసీ లో ఎం. లక్ష్మీనరసింహ వరప్రసాద్ 854/1000 మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు. ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు, కళాశాల విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.