ప్రధాన అర్చకులు విజయ్ కుమార్ శర్మ
విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణంలోని ఎస్ఎల్వి మార్కెట్ వద్ద గల నాగుల కట్ట సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు సుబ్రహ్మణ్య రథోత్సవ వేడుకలు వందలాదిమంది భక్తాదులు, దాతల నడుమ ఘనంగా నిర్వహించడం జరిగిందని ప్రధాన అర్చకులు విజయ్ కుమార్ శర్మ తెలిపారు. తొలుత విజయ్ కుమార్ శర్మ శిష్య బృందం 9 మంది చే ఆలయంలోని శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య విగ్రహాలకు వివిధ పూలమాలలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. సర్వ సూక్త అభిషేకం, పాలాభిషేకం, పంచామృతాభిషేకములను భక్తాదుల చేతుల మీదుగా నిర్వహించారు. తదుపరి వెండి కవచ సమర్పణ సేవను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ నిర్వహించారు. దేవాలయాన్ని వివిధ పూలలతో అలంకరించిన వైనం భక్తాదులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉదయం నుండి సాయంత్రం జరిగిన ఈ వేడుకలను చూడడానికి వందలాదిమంది పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తదుపరి శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యం లను నూతన రథోత్సవములో ఆశీనులు చేసి, ఆలయం నుండి మెయిన్ బజార్, అంజుమన్ సర్కిల్ మీదుగా తేరుబజార్ వరకు వందలాదిమంది భక్తాదులతో పాటు సేవకులు దాశెట్టి సుబ్రమణ్యం, బండ్లపల్లి రంగనాథ్, నాగ శేషు, విజయ్, వందల సంఖ్యలో భక్తాదులు రతాన్ని లాగా రు. నూతనంగా 25 లక్షలతో తయారు చేయబడిన రథం యొక్క దాతలను, ఆలయ అర్చకులు దాతల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి, ఘనంగా సత్కరించారు. పట్టణంలో ఊరేగింపుగా వస్తున్న స్వామి వారి రథోత్సవానికి పూలవర్షంతో భక్తాదులు స్వాగతం పలికారు. రథోత్సవం ముందు చెక్క భజన, మహిళల కోలాటం, శ్రీ అన్నమయ్య సేవా మండలి నిర్వాహకులు పోరాల్ల పుల్లయ్య వారి శిష్య బృందం అన్నమాచార్య సంకీర్తనలతో మారుమోగించారు. తదుపరి దాదాపు నాలుగు వేల మంది దాకా అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ భక్తాదుల బృందం నిర్వహించారు. ఈ వేడుకలు సక్రమంగా నిర్వహించేందుకు వన్ టౌన్ పోలీసులు కూడా సహకరించి, విజయవంతం చేశారు. ప్రధాన అర్చకులు విజయ్ కుమార్ శర్మ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా పట్టణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, దాతల సహకారంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేయడం సంతృప్తిని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ భక్తాదుల బృందం, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.