విశాలాంధ్ర ధర్మవరం=ప్రభుత్వము 2024-25 సంవత్సరమునకు సంబంధించిన ఇంటి పన్నులు ఏక మొత్తంగా చెల్లించిన వారికి పన్ను మొత్తములో ఐదు శాతం మినహాయింపు ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ మినహాయిపు ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంటుందని తెలిపారు. కావున పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని వారు తెలిపారు. అదేవిధంగా పన్ను చెల్లింపు దారులు ఆన్లైన్ నందు గాని తాము తెలిపిన సచివాలయ సెంటర్లలో నగదు రూపంలో గానీ చెల్లించవచ్చునని తెలిపారు. పన్ను చెల్లింపులను మున్సిపల్ కార్యాలయము నందు లేదా ఎల్పీ సర్కిల్ నందు గల సచివాలయము లేదా లక్ష్మీ చెన్నకేశవపురం లోని సచివాలయం నందు చెల్లించాలని తెలిపారు. కావున పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు సకాలంలో పన్నులు చెల్లించి, తమ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.