యువర్ ఫౌండేషన్ ప్రతినిధులు
విశాలాంధ్ర ధర్మవరం::( శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి బండి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ లో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ నేడు యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి శిబిరాలు, నేత్ర స్వీకరణ లాంటి కార్యక్రమాలను ప్రజల నుండి విశేష స్పందన రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కంటి వైద్య శిబిరం దాతలుగా గూండా నాగరాజు, సిద్ధి రాజేష్ లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం యువర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి -కడప వారిచే నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరం నందు కంటి శుక్లములు గల వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ/ ఈ హెచ్ ఎస్.. నిబంధనల ప్రకారం ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించబడును తెలిపారు. వైద్య శిబిరాలకు వచ్చు వారు ఆరోగ్యశ్రీ ,ఈహెచ్ఎస్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు వెంట తీసుకొని రావాలని తెలిపారు. కంటి ఆపరేషన్కు ఎంపికైన వారిని క్యాంపు రోజే హాస్పిటల్కు తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఆపరేషన్కు వచ్చే రోగులు రెండు జతల బట్టలు,ఒక బెడ్ షీట్ వెంట తీసుకొని రావలెనని తెలిపారు. క్యాంపు చైర్మన్గా నేత్రాలయ ఐ క్లినిక్- ఎన్టీఆర్ సర్కిల్- డి. శ్రీకాంత్ రెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు. మా యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానం చేయండి, రెండు జీవితాలలో వెలుగు నింపండి, అదేవిధంగా నేత్రదానం కొరకు కూడా మా సంస్థను సంప్రదించాలని వారు తెలిపారు. కావున ఈ ఉచిత కంటి వైద్య శిబిరమును గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని, తమ కంటికి సంపూర్ణమైన వెలుగును ఇవ్వాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ బి వి సుబ్బారావు, పోలా ప్రభాకర్, వైకె శ్రీనివాసులు, బండ్లపల్లి రంగనాథం, చాంద్ భాషా తదితరులు పాల్గొన్నారు.